జీవో విడుదల చేసినందుకు సంతోషం వ్యక్తం మరి కొన్ని హామీలు అమలు చేయాలి
రజక వృత్తిదారులకు ఉచిత కరెంటు జీవో విడుదల చేసినందుకు సంతోషం వ్యక్తం మరి కొన్ని హామీలు అమలు చేయాలి – – – – టీఎస్ రజక వృత్తిదారుల సంఘం విజ్ఞప్తి”” ””””” హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ హాజరై మాట్లాడుతూ లాండ్రీ లు మరియు దోబీ ఘాట్ రాష్ట్ర ప్రభుత్వం 250 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని జియో నెంబర్ 2న విడుదల చేస్తూ ప్రకటించిన దాన్ని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం స్వాగతించింది. ఎన్నో సంవత్సరాల నుండి వృత్తులను ఆధునీకరించాలని రైతులకు ఇస్తున్న ఉచిత కరెంటు మాదిరిగా రజకులకు కూడా ఇవ్వడాన్ని పలుమార్లు కోరిన మేరకు ఇప్పటికైనా ప్రభుత్వం అంగీకరించింది. వీటితోపాటు మరికొన్ని సమస్యలు పరిష్కారం చేయాలని జీవో నెంబర్ 190 ప్రకారం లక్షమంది రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశారని వాళ్ళందరికీ రెండు లక్షల వరకు రుణాలు అందించాలని . అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు పాఠశాలలు వృత్తి పని కాంట్రాక్టు రజకులకు ఇవ్వాలని గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో దోబీ ఘాట్ లో నిర్మాణానికై ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 50 సంవత్సరాలు నిండిన రజకులకు వృద్ధాప్య పెన్షన్, అనారోగ్యానికి గురయ్యే వారికి ఆరోగ్య బీమా వర్తింపజేయాలని , గోల్కొండ చౌరస్తా లోని సంగం నగర కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో నగర ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజు నరేష్, నగర నాయకులు సింహాచలం రామ్మూర్తి వీరబాబు గణేష్ వెంకన్న రమణ తదితరులు పాల్గొన్నారు