ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమని ఎస్.ఎఫ్.ఐ కార్యదర్శి శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ :- రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఎక్కడ కూడా పటిష్టంగా అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ప్రైవేటు విద్యా వ్యాపారం యదేచగా సాగుతున్న ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల ప్రైవేటు విద్యా దోపిడీకి గురవుతున్నదాని వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను విచ్చిన్నం చేయడం కోసం జాతీయ విద్యా విధానం 2020 ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో పాఠ్యపుస్తకాలు, యూనిఫార్మ్స్ ఇప్పటికీ రాకపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని, కనీసం మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోవడం కెసిఆర్ ప్రభుత్వ ద్వందనీతికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో ఖాళీగా ఉన్న డీఈవో ఎంఈఓ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని భర్తీ చేయకుండా కనీసం పాఠశాల పరిశుభ్రతను కాపాడే స్కావెంజర్స్ ని కూడా నియమించకుండా పాలన చేయడం కెసిఆర్ ద్వందనీతి పాలనకు నిదర్శనం అన్నారు. మన ఊరు మనబడి పథకంలో అన్ని ప్రభుత్వ పాఠశాలను తక్షణమే చేర్చి, సరిపడా నిధులను విడుదల చేయాలని, కార్పొరేట్, ప్రైవేటు ఫీజుల నియంత్ర చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు… ఈ కార్యక్రమంలో కావ్యశ్రీ, మాణికుమార్, కార్తీక్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు…