కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.. బీజేపీ, టిఆర్ఎస్ అబద్దాల పునాదులపై అధికారం కోసం అర్రులు చాస్తోంది.
ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో ఒకటైన కాజీపేట రైల్కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం దేనికైనా సిద్ధమన్నారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ 20 ఏళ్ల కల అని, కోచ్ ఫ్యాక్టరీ కోసం వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కేటాయించాలని విభజన చట్టంలోనే ఉందన్నారు.
కోచ్ ఫ్యాక్టరీతో పాటు బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, కేంద్రం మోసం చేసిందన్నారు జంగా.
గిరిజన యూనివర్సిటీ కోసం 600 ఎకరాలు సేకరించినా, ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని ఇది గిరిజనులకు తీవ్ర ద్రోహం చేయడమే అన్నారు.
తెలంగాణలోని బీజేపీ & టిఆర్ఎస్ నేతలకు దమ్ముంటే కేంద్రంతో పోరాడి కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావాలని సవాల్ చేసారు.
రైలు డబ్బాలు కడిగే ఫ్యాక్టరీ మాకొద్దని, కోచ్ ఫ్యాక్టరీ కావాలని డిమాండ్ చేశారు.
కోచ్ ఫ్యాక్టరీ కోసం ఇప్పటికే 150 ఎకరాలు సేకరించామని, అయితే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేమని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై మండిపడ్డారు జంగా.
గతంలో దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.బిజేపీ తెలంగాణ ప్రజలకు సమాధానంచెప్పాలని ఆయన డిమాండ్చేశారు.
ఏం ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లుఅడుగుతారని ఆయన ప్రశ్నించారు.ఇంకా ఎన్నిఅబద్ధాలు ఆడతారు? తెలంగాణ ప్రజల్ని ఎంత కాలం మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ అంటే భారతీయ బొంకుడుపార్టీ అని తేలిపోయిందని జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ త్యాగాల పునాదులమీద తెలంగాణ రాష్ట్ర నిర్మాణం చేస్తే బీజేపీ, టిఆర్ఎస్ అబద్దాల పునాదులపై అధికారం కోసం అర్రులుచాస్తోందని విమర్శించారు.
ఇప్పటి దాకా బీజేపీ బండి, గుండు, తొండి మాటలతో ప్రజల చెవుల్లోపువ్వులుపెట్టారని అన్నారు.
ఇప్పుడు ఏకంగా రాష్ట్ర బీజేపీ చెవుల్లో కేంద్రం పువ్వులు పెట్టిందనారు.
తెలంగాణకు అన్యాయంచేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు.
ఐటీఐఆర్ ప్రాజెక్టు మాదిరిగానే కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీకి బిజెపి మంగళం పాడిందన్నారు.
కోచ్ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలు మార్లు
పార్లమెంటులో టీపీసీసీ అధ్యక్షులు & ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రాన్ని ప్రశ్నించిన కానీ ఏటువంటి సమాధానం తప్పించుకుంటుంది.
తెలంగాణకు దక్కాల్సిన రైల్వే కోచ్ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమిస్తామని ఈ సందర్భంగా మాజీ డీసీసీ బ్యాంక్ చైర్మన్ & జనగామ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి స్పష్టంచేశారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ జక్కుల రమ రవీందర్ యాదవ్ గారు లింగం మౌనిక చరణ్ రెడ్డి గారు తొట్ల రాజు గారు వస్కూళ శంకర్ గారు టీపీసీసీ సెక్రటరీ సయ్యద్ రజానీగారు బోయిని కుమార్ గారు గుర్రపు కోటేశ్వర్ గారు టీసీఎస్ డైరెక్టర్ దువ్వా శ్రీకాంత్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు రాజారపు స్వామి ముప్పై ఐదు వ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు ఎండీ మహమూద్ గారు కొప్పుల నవీన్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.