ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది. అరకొర కేటాయింపులు మాత్రమే జరిపింది. మొత్తం బడ్జెట్లో విద్యారంగం వాటా గత సంవత్సరం 3.26 %కాగా అది ఈ బడ్జెట్లో 2.67%కి తగ్గింది. గత సంవత్సరం మొత్తం విద్యా రంగానికి 99 వేల 311 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో అది 93,225 కోట్లకు తగ్గింది.
దీనిలో ప్రధానంగా పాఠశాల విద్యకు 54874 కోట్లు (గత బడ్జెట్ లో 59,845 కోట్లు) కేటాయించగా, ఉన్నత విద్యారంగానికి 38 వేల 351 కోట్లు (39 వేల 466 కోట్లు) కేటాయించారు.
పాఠశాల విద్యలో NMMS కు 350 కోట్లు (373 కోట్లు), ఆపరేషన్ డిజిటల్ బోర్డు కు ఒక కోటి( 25 కోట్లు), కేంద్రీయ విద్యాలయాలకు 6,800 కోట్లు (5516 కోట్లు), నవోదయ విద్యాలయాలకు 3800 కోట్లు (3300 కోట్లు), NCERT కి 500 కోట్లు (300 కోట్లు), నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ కు 31,300 కోట్లు( 38, 860 కోట్లు), సమగ్ర శిక్ష కు 31,300 కోట్లు (38,860 కోట్లు), ఉపాధ్యాయ విద్య కు 250 కోట్లు (110 కోట్లు), మధ్యాహ్న భోజనానికి 11500 కోట్లు (11000 కోట్లు) కేటాయింపులు జరిగాయి.
దీనిలో ప్రధానంగా సమగ్ర శిక్ష ద్వారా దేశవ్యాప్తంగా పాఠశాల విద్యకు కేంద్రం అందించనున్న నిధులలో భారీగా ఏడు వేల కోట్లకు కోత విధించింది. కేంద్ర బడ్జెట్ లో కనీసం 10 శాతం విద్యారంగానికి కేటాయించాలని అనేక నివేదికలు చెబుతున్నా బడ్జెట్లో విద్యారంగం వాటా ఏ ఏటికాయేడు కుంచించుకుపోతూ 2.67% కు తగ్గడం కేంద్రానికి విద్యా రంగం పట్ల ఉన్న వివక్షతకు అర్థం పడుతున్నది
- హన్మకొండ గోపాల్ పూర్ ప్రాంతంలో తనీఖీలు నిర్వహించిన పోలీసులు
- మానవత్వం చాటుకున్న మానుకోట యంపి మాలోత్ కవిత..!!
- జర్నలిస్టుల సంక్షేమానికి ఐజేయూ కృషి
- సురక్షితమైన మిషన్ భగీరథ నీటినే త్రాగడం ఉత్తమం
- నష్కల్ కు బదులు ఉప్పుగల్లు రిజర్వాయర్ అని పేరు పెట్టాలి
- తెలంగాణ ద్రోహి కడియం శ్రీహరికి బిజెపిని విమర్శించే నైతిక అర్హత లేదు
- 2022-23బడ్జెట్లో ప్రజలకు మొండిచేయి చూపిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి సిపిఎం
- పేకాట ఆడినా,మత్తు పదార్థాలు అమ్మినా, కఠిన చర్యలు తప్పవు-సిఐ సదన్ కుమార్
- కశిలా పార్క్ వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణకై చేస్తున్న నిరాహార దీక్ష
- ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రికం చేయాలి.
- కార్పొరేట్లు, పెట్టుబడిదారుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్