సిఐటియు రాష్ట్ర కార్యదర్శి లు,జె, వెంకటేష్, పద్మశ్రీ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను కార్మిక కోడి లను,విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి లు జై వెంకటేష్ పద్మశ్రీ డిమాండ్ చేశారు, సిఐటియు ఆధ్వర్యంలో ప్రారంభమైన కార్మిక కర్షక యాత్ర జఫర్గడ్ మండలకేంద్రానికి చేరుకుంది ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలతో ర్యాలీగా వచ్చి, అనంతరం అనంతరం ఈ సమావేశానికి సిఐటియు మండల కార్యదర్శి యాతం సమ్మయ్య, అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొని వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక రైతు ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని వారన్నారు, కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికుల రైతుల సామాన్య ప్రజల హక్కులపై దాడి చేస్తూ నాలుగు వ్యతిరేక కోడ్లు అప్రజాస్వామికంగా ఆమోదించుకున్నరని, అన్నారు,లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో పోరాడుతున్నారని ఎముకలు కొరికే చలిలో పట్టుదలతో పోరాడుతున్న రైతులు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సుమారు 50 మంది చనిపోయారు అని వారన్నారు,కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడులు విద్యుత్ బిల్లు 2020, కార్మిక ప్రజల హక్కులను హరించి యజమానులకు చేసుకోవడానికి అవకాశం కల్పించిందన్నారు, నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టానికి సవరణ చేసిందని వారన్నారు,కార్పోరేట్ మరియు కాంట్రాక్ట్ వేశానికి తెరతీసి ఆహార ప్రాసెసింగ్ దేశ విదేశీ కార్పొరేట్ సంస్థలకు పడుతుందని వారు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు,కార్పొరేట్ అనుకూల విధానాల వేగవంతం చేస్తూ కార్మిక రహితంగా ప్రజావ్యతిరేక విధానాలను కొనసాగిస్తుందని కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రభుత్వానికి తొత్తులుగా ఉండే వ్యక్తులతో కోర్టులు వేయించిన కంటితుడుపుగా కమిటీలు వేసి ఉద్యమాన్ని నీరుగార్చారని చూసిన ఉక్కుపాదంతో అణచివేసేందుకు నిర్మాణాన్ని ప్రయోగించిన ఈ చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని విరమించే దిలెదని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు పి ,శ్రీకాంత్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు, తెలంగాణ రైతు సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జోగు ప్రకాష్, గిరిజన సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు జువారి రమేశు, కాటా సుధాకర్, నక్క యాకయ్య, జి రాజు, గంగరాజు, మల్లేశు, పాష, సిహెచ్ మల్లేష్ , చిన్న రాములు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు,
- హన్మకొండ గోపాల్ పూర్ ప్రాంతంలో తనీఖీలు నిర్వహించిన పోలీసులు
- ఎస్టీ ప్రత్యేక ప్రగతి పద్దు కింద ఈ ఏడాది రూ.6672 కోట్లు ఖర్చు
- మురికి వాడల అభివృద్ధి కోసం కృషి చేస్తా- ఎమ్మెల్యే నన్నపునేని
- అండగా ఉంటాం.. ఆదుకుంటాం.. మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబానికి దైర్యం చెప్పిన ఎస్పీ
- పేదలకు అండగా సియం కేసిఆర్
- వేసవికాలంలో నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి – ఎంపీపీ చింతా కవిత
- అత్యవసర సమయంలో రక్తదానం చేయడం ప్రాణదానం చేయడమే – ఎంపీపీ చింతా కవిత
- కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ- ఎంపీపీ
- వెహికిల్ చాలనాలా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంది-మండవ చంద్రయ్య
- పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ లక్ష్యం ఎంపీపీ యాతాకుల జ్యోతి
- బాల కుమారస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సీతక్క