మహాత్మ జ్యోతిబాపూలేకు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక.జగన్ మోహన్ రావు..
సమాజంలో పీడిత మరియు వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన చిరస్మరణీయుడు జ్యోతిరావు పూలే అని నందిగామ ఎమ్మెల్యే డా”మొండితోక.జగన్ మోహన్ రావు పేర్కొన్నారు ,
మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా నందిగామ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరియు నందిగామ గాంధీ సెంటర్ లోని ఆయన చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సమాజంలో ఉన్న దురాచారాలకు ,కుల వివక్షకు వ్యతిరేకంగా 150 సంవత్సరాలకు పూర్వమే పోరాడి అనేక విజయాలు సాధించిన జ్యోతిబాపూలే దేశంలోని పీడిత వర్గాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు ,
ఆయన స్ఫూర్తితోనే నేడు ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి బీసీల మరియు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు , భారత జాతి సంపదైనా జాతీయ నాయకులకు కుల, మత,వర్గాలను అంటగట్టి వేర్వేరు భావాలతో వీడదీయరాదన్నారు ,
ఈ కార్యక్రమంలో బిసి నాయకులు ,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు