దూపకుంటలో నిర్మితమవుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను ఆ రోజు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరిశీలించారు..పనుల్లో నాణ్యత పాటించాలని,పనుల్లో జాప్యం జరగకుండా వేగంగా పూర్తి చేయాలని సూచించారు..ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేద ప్రజల కోసం ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నారని,త్వరలో పేదలకు ఈ ఇండ్లను అందజేస్తామన్నారు..ఇవే కాకుండా సొంత జాగా లో ఇల్లు నిర్మించుకునేవారికి 3 లక్షల రూపాయలు అందజేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.