ఈ69న్యూస్ వరంగల్ జులై 23
ఎడతెరిపిలేని వర్షాలకు రాత్రి వరంగల్ నగరంలోని మండిబజార్ లో నేలమట్టమైన ఇంటిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృధ్ది,గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేష్,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు పరిశీలించి,యంజియం ఆసుపత్రిలో ప్రమాదంలో మరణించిన మృతదేహాలను పరిశీలించి వారి కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా ర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ..
వరంగల్ నగరంలో శిధిలావస్థలో ఉన్న 379ఇండ్లను గుర్తించి యాజమానులకు నోటీసులు ఇవ్వడం జరిగింది.వాటిలో ఇప్పటికే 145 పురాతన ఇండ్లు కూల్చేశారు.
నోటిసులు అందుకున్న యాజమానులు వారే ఇండ్లను తొలగించుకోవాలని అన్నారు.లేకపోతే జిహెచ్ఎంసి అధికారులే తొలగిస్తారని,ప్రజలు సహకరించాలని కోరారు.
వర్షాలు,వరదల సమయంలో సెల్ఫీల కోసం,చేపల కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు.
ప్రాణ నష్టం,ఆస్థి నష్టం అంచనాలు సిద్ధం చేస్తున్నామని,
ముఖ్యమంత్రి కేసీఆర్ బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటారని హామీ ఇచ్చారు.