E69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి: రష్యా -ఉక్రెయిన్ ల మధ్య కొనసాగుతున్న యుద్ధం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యకు దిగడం సరైన నిర్ణయం కాదని పేర్కొంది .తక్షణమే సైనిక పోరును నిలిపివేసి శాంతి స్థాపనకు కృషి చేయాలని జిల్లా కమిటీ సూచించింది .ఈ మేరకు సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ప్రకటన విడుదల చేసింది.ఈ సందర్భంగా సీపీఎం పార్టీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ సోవియెట్ యూనియన్ కూలిపోయిన తర్వాత రష్యా కు ఇచ్చిన హామీకి విరుద్ధంగా అమెరికా నేతృత్వంలోని నాటో తూర్పు యూరప్ లో విస్తరించుకుంటూ పోయిందని ,నాటో లో చేరాలన్న ఉక్రెయిన్ ప్రయత్నాలు రష్యా భద్రతకు ప్రమాదముందని, అంతేకాకుండా తూర్పు యూరప్ లోని తన సరిహద్దులో నాటో దళాలు వాటి క్షిపణుల ఉనికి కారణంగా రష్యా తన భద్రత విషయంలో ఆందోళన చెందుతుంది అని అన్నారు . అందువల్ల నాటో లో ఉక్రెయిన్ చేరకుండా భద్రత హామీ ఇవ్వాలని రష్యా డిమాండ్ చట్టబద్ధమైనదని సీపీఎం పార్టి తెలిపింది. రష్యా భద్రత అవసరాలను తీర్చేందుకు అమెరికా నాటో తిరస్కరించడం, ఈ ప్రాంతానికి సైన్యాన్ని పంపడంలో యు ఎస్ అక్కడ అ ఉద్రిక్తతలు మరింత పెరిగాయని పేర్కొంది .శాంతి స్థాపన కోసం తూర్పు ఉక్రెయిన్లోని డాన్ బాస్ ప్రాంతం తో సహా ప్రజలందరి నిజమైన ఆందోళనలను పరిష్కరించాలని సూచించింది. ఇరుదేశాలు చర్చలను ప్రారంభించాలని తెలిపింది. ఇరుపక్షాల మధ్య గతంలో చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని సిపిఎం పార్టీ పేర్కొంది .అదేవిధంగా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వేలాది మంది భారత దేశ పౌరులు భద్రతకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ కోరుతుంది .భారతీయ విద్యార్థులను దేశానికి తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.